టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. అలా.. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ సినిమాను మెగాస్టార్తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన అనిల్.. ఉగాది సందర్భంగా సినిమా పూజ కార్యక్రమాలను ప్రారంభించాడు. జూన్ నెలలో సినిమా సెట్స్పైకి రానుంది. మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమని.. వింటేజ్ చిరును ఈ సినిమాలో చూడబోతున్నారంటూ ఇప్పటికే అనిల్ ప్రామిస్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్కు సక్సెస్ ఇచ్చే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నాడు అనిల్. ఇక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఫిక్స్ చేశారు. మొదట ఈ సినిమాలో అతిథి రావు హైదారి హీరోయిన్ అంటూ, బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ హీరోయిన్ అంటూ రకరకాలుగా వార్తలు వినిపించినా.. చివరకు నయనతార అయితేనే సినిమాకు పర్ఫెక్ట్ గా ఉంటుందని చిరు అనడంతో అనిల్ చెన్నైకు వెళ్లి మరి ఆమెకు స్టోరీ వినిపించి ఆమెతో గ్రీన్ ఇప్పించుకున్నాడట. అయితే.. రెమ్యునరేషన్ రూ.10 కోట్ల రేంజ్ లో ఆమె డిమాండ్ చేసినా.. నిర్మాతలు సైతం దానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని.. త్వరలోనే సెట్స్లో అడుగుపెట్టనిందని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్తో నయనతార సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో మెరిసింది.
ఒక సినిమాలో చిరంజీవికి జోడిగా మరో సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అనిల్ సినిమాలో ఎలాంటి స్కోప్ తో పలకరించనుందో చూడాలి. కాగా ఈ ప్రాజెక్టులో నయనతార తో పాటు మరో హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉందట. సరైనోడు సినిమాలో లేడీ ఎమ్మెల్యే క్యారెక్టర్ లో నటించిన కేథరిన్ థెరిసా ఈ సినిమాలో మరో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకుంది. ఇక అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో సినిమాలో తన నటనకు అత్యంత ప్రాధాన్యం ఉండనుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వనున్నారట టీం.