టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి పాత తరం హీరోలతో సైతం సినిమాలను తెరకేకించి సక్సెస్ లో అందుకున్న ఆయన.. చిరంజీవి, వెంకటేష్ నాగ్, బాలయ్యలతో సైతం పలు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. అప్పటితో ఆయన దర్శక ప్రతిభను ఆపలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బన్నీ లాంటి హీరోలను సైతం ఆయన లాంచ్ చేసి మంచి సక్సెస్లు అందించారు. కాగా.. రాఘవేంద్ర రావు, మెగాస్టార్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. వాటిలో జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు సినిమాలు ఎవర్గ్రీన్ బ్లాక్ బస్టర్లు.
ఇక.. ప్రస్తుతం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను మే 9న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాఘవేంద్ర రావు.. ఓ ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ తన 100వ సినిమాల గంగోత్రి సినిమా రూపొందనుందని.. ఈ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు అంటూ వెల్లడించాడు. అయితే.. తన వందో సినిమా విషయంలో మొదట ప్లానింగ్ వేరేగా ఉండేదని చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు. నా వందో సినిమా.. ఎప్పటికీ గుర్తుండి పోయేలా రూపొందించాలని భావించా. ఈ క్రమంలోనే చిరు, నాగ్, వెంకీలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేశా. దినికీ ఈ సినిమాకు ముగ్గురు హీరోలు ఒప్పుకున్నారు కూడా.
కథ కూడా దాదాపు పూర్తి చేసి.. త్రివేణి సంగమం అనే టైటిల్ని ఫిక్స్ చేశాం. అల్లు అరవింద్, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మించాలని భావించారు. అంతా ఓకే అనుకున్న టైంలో నిర్ణయాన్ని అశ్వినీ దత్ మార్చుకున్నాడు. ముగ్గురు స్టార్లను పెట్టి ఎందుకు అంత టెన్షన్ తీసుకోవాలి.. ఎవరో ఒకరు మాకు సీన్స్ తగ్గాయి.. సరైన పాట లేదని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.. ఈ టెన్షన్ అంతా ఎందుకని అశ్వినీ దత్ అన్నాడట. ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని భావించినా రాఘవేంద్రరావు.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం సాధారణ విషయం కాదని.. అందుకే త్రివేణి సంగమం సినిమాను విరమించుకున్నాను అంటే చెప్పుకొచ్చాడు. ఇక రాఘవేంద్రరావు డేర్ చేసి ఆ సినిమాను రూపొందించి ఉంటే మాత్రం పీక్స్ లెవెల్లో ఆడియన్స్ లో అంచనాలు నెలకొనేవి. సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేది అనడంలో సందేహం లేదు.