నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య సైతం ఒక్క దశలో వరుస ప్లాప్లను ఎదుర్కొన్నారు. దాదాపు ఫేడవుట్ దశలో అఖండ బ్లాక్ బస్టర్తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన బాలయ్య.. సెకండ్ ఇనీంగ్స్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు బాలయ్య రెమ్యునరేషన్ ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. అంతేకాదు.. ఆయన నుంచి అఖండ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్కేసరి సినిమాలకు సైతం ఆయన రెమ్యూనరేషన్ రూ.15 నుంచి రూ.18 కోట్ల వరకు మాత్రమే ఉంది.
కాగా.. బాలయ్యతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్పించుకొని బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే అంత సులభం కాదు. ఆయనకు తన సొంత షరతులు ఉంటాయి. ఆ షరతులలో అంగీకరించి.. ఆయనతో సినిమా తీసి బ్లాక్ బాస్టర్ కొడితే మాత్రం భారీ లాభాలు వస్తాయని నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేంజ్ అయింది. ఈ క్రమంలోనే వరుస సక్సెస్లు అందుకుంటున్న బాలయ్య.. రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా భారీ లెవెల్ లో పెంచేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇటీవల డాకు మహారాజ్ తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న క్రమంలో రెమ్యూనరేషన్ను మరింతగా పెంచాడట. అఖండ 2 సినిమాకు బాలయ్య రూ.35 కోట్ల రెమ్యునరేషన్ను ఛార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అదే టైంలో గోపీచంద్ డైరెక్షన్లో రూపొందనున్న నెక్స్ట్ సినిమా కోసం రూ.10 కోట్లను పెంచి.. రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేయనున్నాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ వైరల్గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే.. డైరెక్టర్ గోపీచంద్కు మరో రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నటి నటులు, సాంకేతిక బృందం, లొకేషన్, గ్రాఫిక్స్, ప్రమోషన్స్.. ఇలా అన్ని అంశాలను కలిపితే కచ్చితంగా ప్రాజెక్ట్ రూ.100 కోట్ల బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్థాయిలో సినిమాను రూపొందించి లాభాల్లోకి తీసుకురావాలంటే నిర్మాతలకు కత్తిపై సాము అవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బాలయ్యకు ఉన్న క్రేజ్, మాస్ ఆడియన్స్ లో ఆయన చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో.. డిస్ట్రిబ్యూటర్లు, థియేట్రికల్, ఓటిటి హక్కుల ద్వారా ఈ ఖర్చును సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయాలని నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు.