టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పోరు మొదలుకానుందా అనే ప్రశ్నకు ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ మొదలుకానుందట. చిరు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విశ్వంభర షూట్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కేవలం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిందని.. ఇక 30% గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూలైలోనే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీం.
కానీ.. చిరంజీవి దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ తో చెప్పినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 25న ఏ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే.. సెప్టెంబర్ 5న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఓజి సినిమాను రిలీజ్ చేయనున్నారు. పవన్ రీసెంట్ గానే నిర్మాతలను పిలిచి బ్యాలెన్స్ షూటింగ్ను పూర్తి చేయడానికి డేట్స్ కూడా అడ్జస్ట్ చేస్తానని చెప్పారు.. జూలై నెలలో ఆయన ఓజీ సినిమాని పూర్తి చేసేస్తాడని టాక్. ఎప్పటి నుంచి.. ఎప్పటి వరకు డేట్స్ కేటాయిస్తాడో క్లారిటీ ఇస్తే వెంటనే రిలీజ్త్ డేట్ని కూడా ప్రకటించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారట.
ఇక ఒకే నెలలో అన్నదమ్ముల సినిమాలు 20 రోజుల గ్యాప్లో రిలీజ్ కావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఈ క్రమంలోనే మొదటిసారి పవన్ వర్సెస్ చిరు వార్ జరగబోతుంది. ఓజీ సినిమాకు సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుందని.. దసరా సెలవలతో సినిమాను మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.. కలెక్షన్లు కూడా అదే లెవెల్ లో ఉంటాయని పవన్ ఫ్యాన్స్ అంతా ఆనంద పడుతున్నారు. ఇలాంటి క్రమంలో చిరంజీవి విశ్వంభర సినిమాను రిలీజ్ చేయబోతున్నాడని టాక్తో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కెరీర్లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు.. ఫ్రీ గ్రౌండ్ దొరికితే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తుంది. అలాంటి సినిమాకు చిరంజీవి అడ్డు వస్తున్నారంటూ పవన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అయితే విశ్వంభర కే ఎక్కువ నష్టం కలుగుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.