ఇంటిని 40 వేలకు తాకట్టుపెట్టి మరి ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్.. ఎవరంటే..?

ఇండస్ట్రీలో నటినట్లుగా సత్తా చాటుతున్న చాలామంది.. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. అది వ్యాపారాల్లో ఆయినా.. లేదా సినీ రంగంలో దర్శక, నిర్మాతలగా అయినా.. మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలా గతంలో ఓ స్టార్ కమెడియన్ సీనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం రూ.40 వేలకు ఇంటిని తాకట్టు పెట్టు మరి ప్రొడ్యూసర్ గా మారాడు. ఇంతకీ ఆ కమీడియన్ ఎవరు.. ఎన్టీఆర్‌తో ఆయన చేసిన సినిమా రిజల్ట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అప‌ట్లో సొంత ఇంటిని రూ.40 వేలకు తాకట్టు పెట్టి సినిమా తీయడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇండస్ట్రీలో నటీనటులుగా సక్సెస్ అయిన తర్వాత నిర్మాతలుగా మారి ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డవారు ఉన్నారు. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ పై నమ్మకంతో ఆ స్టార్ కమెడియన్ చెన్నైలోని తన సొంత ఇంటిని తాకట్టు పెట్టేసి మరి ప్రొడ్యూసర్ గా మారాడు.

This Beloved Actor Is The Grandfather Of Tollywood Comedy, Nephew Carries  The Mantle Now - News18

ఇంతకీ ఆయన ఎవరో కాదు పద్మనాభం. లక్షలాది మంది ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించిన పద్మనాభంకు.. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక నటనతో ఆర్థికంగా బాగా స్థిరపడిన పద్మనాభంకు.. దేవత స్టోరీ బాగా నచ్చిన బడ్జెట్ ఎక్కువవుతుందని భయంతో నిర్మ‌త‌గా చేసే ధైర్యం చేయలేకపోయాడు. అప్పటికే స్టార్ కమెడియన్ గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆయన.. నిర్మాతగా మారితే సినిమా వల్ల నటుడిగా దెబ్బ తింటానేమో.. సినిమా ఫ్లాప్ అయితే ఆర్ధికంగా మరింత నష్టపోవాల్సి వస్తుందని భయంతో వెనకడుగు వేసాడట. అయితే ఆ కథ తిరిగి తిరిగి మళ్లీ పద్మనాభంకే రావడంతో.. ఈసారి ధైర్యం చేశాడు. ఎన్టీఆర్ను హీరోగా పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఆయన్ని అప్రోచ్ కాగా.. పద్మనాభం ప్రొడ్యూసర్ గా మారుతున్నారని సంతోషపడిన ఎన్టీఆర్.. వెంటనే డేట్స్ ఇచ్చేయడంతో పాటు.. ఆయనను సక్సెస్ అవ్వాలని భుజం తట్టి మరీ ఎంకరేజ్ చేశాడట.

NTR's Devatha Telugu Full Movie | NTR | Mahanati Savitri | Padmanabham  |1965 Telugu Old Hit Movies

ఇక తర్వాత హీరోయిన్ గా నటించేందుకు సావిత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇల్లాలి చుట్టూ తిరిగే స్టోరీ కావడంతో దేవత అనే టైటిల్ ని పద్మనాభం ఫిక్స్ చేశారు. డైరెక్టర్గా హేమంబ‌ర‌ద‌రావు వ్యవహరించిన ఈ సినిమా తెలుగు సినిమాలలోనే అత్యధిక మంది స్టార్స్ నటించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే మొదట పద్మనాభం భయపడినట్లే ఈ సినిమాకు బడ్జెట్ సరిపోలేదట. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా మధ్యలో సినిమాను ఆపకుండా పట్టుదలతో పద్మనాభం సినిమా తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలోనే రూ.40 వేలకు ఇంటిని కూడా తాకట్టు పెట్టారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువగా రిజల్ట్ రావడంతో పాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక దాదాపు 22 మంది స్టార్స్ కనిపించిన ఏకైక సినిమా గాను సంచలనం సృష్టించింది.

Devata

ఈ సినిమాలో పద్మనాభం సెలబ్రిటీ కాగా.. అప్పుడు ఉన్న స్టార్స్ జమున, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణ రెడ్డి, అంజలీదేవి, షావుకారి జానకి ఇలా అందరూ ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చిన వారిలా కనిపించారు. ఇలా మొత్తం 22 మంది సినిమాలో మెరుసారు. ఇక సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్గా నిలిచింది. ఇక సినిమాలో మరో హైలెట్ పాటలు. ప్రతీ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాలో సాంగ్ కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించడం కష్టమైతే.. ఆయన నైట్ షిఫ్ట్‌లు కూడా కేటాయించి మరి ఆ సాంగ్ ని కంప్లీట్ చేశారట. ఇలా సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడి సినిమాను ఫైనల్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశారు. 50 రోజుల ఫంక్షన్‌ను రాజమండ్రిలో గ్రాండ్‌గా నిర్వహింనిన‌ పద్మనాభం.. తర్వాత నటుడు గానే కాకుండా ప్రొడ్యూసర్ గాను పలు సినిమాలతో సక్సెస్ అందుకుని లెక్కలేనన్ని ఆస్తులు కూడా పెట్టారు. కానీ.. తర్వాత ఆస్తులన్నీ పోగొట్టుకొని.. కడు పేదరికంలో 2010లో మరణించారు.