టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస ప్లాప్లు ఎదురుకావడంతో ఫెడౌట్ దశకు చేరుకుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోల్కొని అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సూర్య రెట్రో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది పూజ హెగ్డే. అలా.. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి.
ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు డైరెక్టర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పూజా హెగ్డేకి కాల్ చేసి.. మొదట మీతో పని ఉంది మేకప్ లేకుండా మీరు ఒకసారి ఇక్కడకు రావాలని అడిగాడట. మొదట అలా చెప్పడంతో ఫీల్ అయ్యానని.. ఎందుకు అని అడగగా సినిమాలో మేకప్ లేకుండానే నటించాల్సి ఉంటుంది.. అలానే కథను ప్లాన్ చేసాం అని చెప్పారని.. ఫీల్ అయినా తనకు అలా నటించడం ఇష్టం. అందుకే మేకప్ లేకుండానే కనిపించా. సినిమాలో అలాగే నటించా.. అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
ఇక గతంలో పూజ హెగ్డే మేకోవర్పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన న్యాచురల్ నటనతో ఆ ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టనుందట బుట్ట బొమ్మ. కాగా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. విజయ దళపతి జననాయగన్ సినిమాలోని నటిస్తుంది. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత.. కాంచన 4లోను.. పూజ హెగ్డే ప్రధాన పాత్రలు కనపడనుందని టాక్. రజనీకాంత్ కూలి సినిమాలోని స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే చిందేయనుంది.