పాలిటిక్స్ కారణంగా ఆ హీరోతో ఛాన్స్ మిస్‌.. తారక్‌తోను మూవీ మిస్.. గోపీచంద్ మలినేని

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా దూసుకుపోతున్న వారిలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిడియల్ తో జ‌ట్‌ సినిమాను రూపొందించి బ్లాక్ పాస్టర్ అందుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ను మాస్ హీరోగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

Jr NTR says he is a big fan of Vijay's dance moves, heaps praise on ' Thalapathy'

దీనిపై గోపీచంద్ మాట్లాడుతూ నేను బాలయ్య వీర సింహారెడ్డి తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతితో సినిమా చేయాలనుకున్నా.. దిల్‌రాజు సమక్షంలో ఆయనకు కథ కూడా వినిపించా.. ఆయనకు కథ నచ్చింది. కానీ.. అదే టైంలో పొలిటికల్ ఎంట్రీ కి ఆయన సిద్ధమయ్యారు. ఇక చివరి సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్న క్ర‌మంలో తెలుగు డైరెక్టర్‌తో సినిమా వద్దని విజయ్‌కు తన సన్నిహితులు చెప్పరట.. ఈ క్రమంలోనే ఆయన నాతో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారంటూ గోపీచంద్ వివరించాడు. అంతేకాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫుల్ మాస్ యాక్షన్ కథను చెప్పానని.. ఆయనకు కథ నచ్చింది కానీ.. నీతో ఒక కామెడీ స్టోరీ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న గోపి అని ఆయన అనడంతో ఎన్టీఆర్ తో కూడా సినిమా ఛాన్స్ మిస్ అయిందంటూ వివరించారు.

EXCLUSIVE: Gopichand Malineni on what one can expect in Jaat 2: “MORE  action and entertainment than Jaat; also focus on Sunny Deol's family”;  CONFIRMS that his next is with Nandamuri Balakrishna: “We

ఇక ఇప్పుడు తారక్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయనతో సినిమా చేయాలంటే కచ్చితంగా మంచి మాస్ యాక్షన్ స్టోరీ తోనే సినిమా తీస్తా అంటూ గోపీచంద్ వివరించారు. ఇక.. బాలయ్యతో మొదట వీరసింహారెడ్డి సినిమాను తను తీయాలనుకోలేదని.. నేను అనుకున్న కథ‌.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన జాట్ స్టోరీ అని.. అయితే బాలయ్య.. గోపి అఖండ తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. వాటికి మ్యాచ్ అయ్యేలా కథ‌ని చెప్పు అని బాలయ్య అనడంతో జాట్ కథ‌ను పక్కనపెట్టి వీర సింహారెడ్డి స్టోరీని వినిపించాన‌ని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.