టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు తారక్.. దానికి చివరగా తారక్ నుంచి వచ్చిన దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లను కొల్లగొట్టి.. హిట్గా నిలిచింది. ఇక పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఉంటే కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. కాగా దేవర తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు.
ఇక వీరిద్దరికాంబలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్లతో.. డ్రగ్స్ మాఫీయా నేపద్యంలో రూపొందనుందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజిఎఫ్, కేజీఎఫ్ 2, సలార్లతో బ్లాక్ బస్టర్లు అందుకుని దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్, నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాపై ఆడియన్స్లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాల్లో తారక్ జంటగా రుక్మిణి వసంత్ నటించినుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాల్లో శృతిహాసన్ కూడా నటిస్తోందని మరో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇక మొదటి నుంచి ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే పెద్దగా సాంగ్స్ ఉండవన్న సంగతి తెలిసిందే.
కానీ.. కేవలం తారక్ కోసం ప్రశాంత్ ఈ సినిమాలో డ్యాన్స్ విషయంపై కూడా దృష్టి సారించాడట. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్లో తారక్ – శృతితో కలిసి చిందేయనున్నాడట. కాగా గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో రామయ్య వస్తావయ్య సినిమా లో ఎన్టీఆర్, శృతిహాసన్ జతకట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ను తారక్ సినిమాలో బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్.. దయచేసి డ్రాగన్ సినిమాలో శృతిహాసన్ ను మాత్రం పెట్టవద్దంటూ దండం పెట్టేస్తున్నారు. ఆమె బదులు మరో హీరోయిన్ తీసుకుని ఆ స్పెషల్ సాంగ్ లో నటింపజేయాలని రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి మూవీ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.