మహేష్ – నాగ్ కాంబోలో స్టార్ డైరెక్టర్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్.. ఎందుకు వర్కౌట్ కాలేదంటే..?

టాలీవుడ్‌లో కింగ్‌ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ అదే యంగ్ లుక్‌, ఫిట్నెస్‌తో అందరికీ షాక్ ఇస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టార‌ర్ వస్తే ఆ సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

5 unforgettable Telugu super hits of director Krishna Vamsi | Telugu Movie  News - The Times of India

కాగా గతంలో ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఇదే అలోచ‌న చూశాడ‌ట‌. వీళ్ళిద్దరి కాంబోలో ఓ బిగెస్ట్ మల్టీ స్టార‌ర్‌ను ప్లాన్ చేశాడట. కానీ.. అది వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. అసలు ఆ కాంబో ఎందుకు వర్కౌట్ కాలేదో.. కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఫ్యామిలీ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ. ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ ఒకప్పుడు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన‌వే. నాగార్జున, మహేష్ బాబులతో కూడా విడివిడిగా ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. నాగార్జునతో ఆయన చేసిన నిన్నే పెళ్ళాడుతా ఎవర్గ్రీన్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు.. యూత్‌ను సైతం ఈ మూవీ ఆకట్టుకుంది.

మహేష్ బాబు, నాగార్జునతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్,  ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. - Mahesh Babu Nagarjuna Multistarrer That Never  Took Off Director ...

ఇక మహేష్ బాబు తో మురారి. ఇక ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే చాలు ఇప్పటికీ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయి మరి సినిమా చూస్తారు. కాగా గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేయాలని భావించాడట వంశీ. కానీ.. విషయం చెప్పిన తర్వాత కూడా ఇద్దరు హీరోలు.. మల్టీసార‌ర్ చేసేందుకు ఇష్టపడలేదట. కారణమేంటో తెలియదు కానీ వీరిద్దరూ ఆసక్తి చూపకపోవడంతో.. కృష్ణవంశీ కూడా ఆ ప్రయత్నాలను ఆపేశాడు. ఇలా గతంలో మహేష్, నాగ్ కాంబోలో రావలసిన ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్.. ఆది లోనే ఆగిపోయింది.