స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్ధకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్కు దూరమై దాదాపు రెండేళ్లు గడిచినా.. ఇంకా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఎప్పుడెప్పుడు సమంత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత తనకు ఎప్పుడు తోడు ఉన్నడంటూ ఓ వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక సమంత కెరీర్ ప్రారంభం నుంచి ఆమె బెస్ట్ ఫ్రెండ్ లిస్టులో కచ్చితంగా చిన్మయి పేరే మొదట వినిపిస్తోంది. దాదాపు తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచి సామ్ అన్ని సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పేది. అలా వీళ్ళిద్దరి మధ్యన స్నేహం ఏర్పడి ఒక కుటుంబంలా ఇద్దరు కలిసిపోయారు. అయితే.. సినిమా చిన్మయి భర్త.. ప్రముఖ హీరో కమ్ డైరెక్టర్.. రాహుల్ రవీంద్రన్ కూడా అందరికీ పరిచయమే.
సమంత అతనితో కూడా ఓ తమిళ సినిమాలో కలిసి నటించింది. అప్పటి నుంచే ఆయనతోనూ మంచి స్నేహం ఉంది. వివాహం చేసుకున్న తర్వాత ఈ పరిచయం మరింత బలపడింది. రీసెంట్గా సమంత కోలీవుడ్ లో నిర్వహించిన గోల్డ్ క్వీన్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొని అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలోనే అత్యంత సన్నిహితుడు రాహుల్ రవీంద్రాన్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. నేను అనారోగ్యానికి గురై ఇక నా జీవితం ముగిసింది అని భయపడుతున్న టైంలో రాహుల్ నా పక్కన ఉన్నాడని.. హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నా బాగోగులు చూసేవాడని.. నన్ను డిప్రెషన్ లోకి వెళ్లకుండా చేసేవాడని.. తన పనులన్నీ మానేసుకుని ఎక్కువ సమయం నాకోసమే కేటాయించాడని వివరించింది.
ఈ బంధానికి నేను ఎలాంటి పేరు పెట్టలేను.. స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడు ఇలా ఏ పేరుతోను పిలవలేనని వివరించింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోనే నేను ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు అదృష్టవంతురాలని. నా కష్టంతో పాటు.. లక్ కలిసి రావడం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్న అంటూ వివరించింది. ఇక ఆమె ఎన్ని రోజులు కేవలం హీరోయిన్గా మాత్రమే మనల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నిర్మాతగా మారిన సామ్.. ట్రలాల మూవీ మేకర్స్ బ్యానర్ పై శుభం సినిమా నిర్మించింది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్స్ ను కొనసాగిస్తుంది. వచ్చే నెల 9న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్, ట్రైలర్ రిలీజై ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ అనిపిస్తోందని.. ఆడియన్స్ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.