అసలుకే ఎసరు…. కళ్యాణ్ రామ్ ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బింబిసార నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి కూడా మూడేళ్లు దాటింది. అయితే.. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన అమిగోస్, డెవిల్ సినిమాలు నిరాశపరిచాయి. అయినా.. బింబిసార సీక్వెల్‌ తీయడానికి కళ్యాణ్ రామ్ సాహసం చేశారు. ఇక ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ వశిష్ట.. విశ్వంభర సినిమాకు లాక్ అయిపోయారు. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక రొమాంటిక్ ఫేమ్ అనిల్ పోడూరికి పార్ట్ 2 బాధ్యతలను అప్పగించాలని భావించాడు. ఇక అనౌన్స్మెంట్ వరకు వచ్చిన ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

కారణం బడ్జెట్ ఎక్కువగా డిమాండ్ చేయడమే. ఈ క్ర‌మంలోనే కళ్యాణ్ రామ్.. మరో సినిమాను తెర‌కెక్కించి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి లాభాలతో బింబిసారని సెట్స్‌పైకి తీసుకురావాలని భావించాడట. అయితే ఈ ప్రాజెక్టును చేయకుండా ఉండాల్సిందని.. ఇప్పుడు దీని ప్రభావం వల్ల బింబిసార 2 సినిమా ఇబ్బందుల్లో పడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. తాజాగా రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాతో హిట్ కొట్టి లాభాలను పొందుతామని నమ్మకంతో కళ్యాణ్ రామ్ బింబిసార 2ను పెండింగ్‌లో పెట్టేసి మరి.. ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితాలు డిసప్పాయింట్ చేసే దిశగా వెళ్తున్నా.. ఈ నాలుగు, ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ అయిపోతుందని కళ్యాణ్ రామ్ నమ్మిన.. అవి నిజమయ్యేలా ఎక్కడా కనిపించడం లేదు. 50% రికవరీకి కష్టపడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఇందులో భాగం కావడంతో.. ఆ నష్టాలను కళ్యాణ్ రామ్ కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బింబిసార 2పై ఎక్కువగా బడ్జెట్ను కేటాయించలేక కళ్యాణ్ రామ్ సతమతమవుతున్నాడట. ఈ కారణంగానే సీక్వెల్లో పక్కన పెట్టేసి మరో సినిమా చేయాలని కళ్యాణ్ రామ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేగా ఆదిత్య వర్మను అలాగే.. వైష్ణవ్‌ తేజ్‌.. రంగ రంగ వైభవంగా సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన గిరి సాయి.. కళ్యాణ్ రామ్‌కు ఒక కథ చెప్పాడని.. ఆ స్టోరీ నచ్చడంతో మొదట దాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.