టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేకుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి పై రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ బిజీగా గడుపుతున్న కీరవాణి ఇటీవల ఈటీవీ షో లో 24 సీజన్లు పూర్తి చేసుకున్న పాడుతా తీయగా రియాలిటీ సింగింగ్ షో జడ్జ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా.. రీసెంట్గా ఎలిమినేట్ అయిన ప్రవస్థి.. చంద్రబోస్, సునిత, కీరవాణిలను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ కీరవాణికి నెగిటివిటీ ఏర్పడింది. ఇక కీరవాణి నుంచి కూడా ఈ ఆరోపణల పై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేని కీరవాణి పై.. ఒక్కసారిగా నెగెటివిటీ పెరిగిపోయింది. కొంతమంది కిరవాణికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. ఆయన వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓ సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ.. హిందూ మరియు ఇతర మతాలను అగౌరవించినట్లుగా కిరవాణి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు కీరవాణి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కీరవాణి మాట్లాడుతూ.. నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా. కానీ.. క్రిస్టియన్ మతం అంటే కాస్త ఎక్కువ గౌరవం. కారణం కేవలం ఆమాత్రంలోనే క్షమించేతత్వం ఎక్కువగా ఉంటుంది.
మిగతా మతాల్లో అది కనపడదంటూ వివరించాడు. దీనిపై నెటిజన్స్ ఫుల్ లెవెల్లో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వారు కీరవాణిని ఏకీపారేస్తూ.. ఇతని సినిమాలను బ్యాన్ చేసేయాలంటూ ట్వీట్లు వేస్తూ.. నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం కీరవాణి.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే మెగాస్టార్ విశ్వంభరతో పాటు.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా.. ఆయన సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాల నుంచి పలు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ప్రస్తుతం జక్కన్న రూపొందిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు మహేష్ బాబు ఎస్ఎస్ఎంపి 29 కు కూడా కిరవాణినే సంగీతం అందిస్తున్నారు.