టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ప్రతి చిన్న అంశాన్ని కూడా రూపొందిస్తున్నాడు. ఇక జక్కన్న, మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమానే మొట్టమొదటి పాన్ వరల్డ్ ప్రాజెక్టు అని అంతా భావిస్తున్నారు. కానీ.. ఇలాంటి క్రమంలోనే రాజమౌళి కంటే ముందే మరో స్టార్ డైరెక్టర్ పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. రాజమౌళికి రావాల్సిన క్రెడిట్ ను దక్కించుకోనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. సందీప్ రెడ్డివంగా.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా డిజైన్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇక జక్కన్న ఎస్ఎస్ఎంబి 29 కంటే ముందే.. సందీప్, స్పిరిట్ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సినిమాను మొదట సందీప్ రెడ్డి వంగ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తే.. రాజమౌళి కన్నా మొదట పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందించిన డైరెక్టర్గా క్రెడిట్స్ సందీప్ రెడ్డివంగా కు వెళ్ళిపోతాయి.