తాజాగా జరిగిన పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో సిందూ జలాలను పాక్కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ ను షేర్ చేసుకుంది. కొద్దిసేపటికి ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్గా మారింది. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని కాశ్మీర్ పహల్గామ్కు చేరుకున్న యాత్రికులో 27 మందిని ఊహించని రీతిలో ఉగ్రవాదులు చంపేసిన సంగతి తెలిసిందే. వారి ఆనందం, కేరింతలు కాస్త ఆర్తనాధాలుగా మారిపోయాయి. క్షణాల్లో పహల్గామ్ విషాదంతో నిండిపోయింది.
ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతమని కాదు.. యావత్ దేశానికి దిగ్భ్రాంతికి గురి చేసింది, ఈ దాడిపై మోడీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. దీనికి సంబంధించిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని.. ఎక్కడ దాక్కున్నా ప్రతి కారం తీర్చుకుని తీరతామని ప్రధాని హెచ్చరించాడు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం పాకిస్తాన్ హస్తము ఉన్నట్లు గట్టిగా నమ్మింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను.. స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు పంపింది. అదే క్రమంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
అయితే సమంత దీని ఉద్దేశిస్తూ తన ఇన్స్టా వేదికగా సముద్రాలు నీళ్లు తాగలేవు.. చెట్లు పండించిన పండ్లు తినలేవు.. సూర్యుడు తన కాంతిని చూడలేడు.. పువ్వులు తమ పరిమళాలని ఆస్వాదించలేవు.. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం ఒకరికి ఒకళ్ళు సాయం చేసుకోవడానికి భూమిపై ఉన్నాం. నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు. అందరికోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావని కొటేషన్ను సమంత షేర్ చేసుకుంది. ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్లుగా సమంతా తన పోస్టుల వెల్లడించింది. భారత్.. సింధు జలాలను పాకిస్తాన్ కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలో సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట దుమారం అయిపోయింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు కోపాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుందంటూ అందరూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కొన్ని గంటలకు సమంత పోస్టులు డిలీట్ చేసింది. అయితే సమంత ఏ ఉద్దేశంతో పోస్ట్ షేర్ చేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇండియా పరిస్థితులకు తగ్గట్టుగా ఆమె పోస్ట్ ఉండటంతో నెటిజన్లు లో ఆమెపై ఫైర్ అవుతున్నారు. దీనిపై సమంతా రియాక్ట్ అయితేనే కానీ క్లారిటీ రాదు.