సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి విశ్వంభర పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇక నందమూరి నటసింహం బాలయ్య.. ఎన్.బి.కె 109 తో సంక్రాంతి బరిలో నిలవనున్నాడు.
అంతేకాదు అక్కినేని నట సామ్రాట్ నాగచైతన్య హీరోగా కార్తికేయ 2 డైరెక్టర్ చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారని మొదట వార్తలు వినిపించినా.. ఇప్పుడు సంక్రాంతి బరిలో తండేల్ తప్పుకుందని సమాచారం. దీంతోపాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాను కూడా అనుకోని పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందట. కేవలం గేమ్ ఛేంజర్ కోసమే 80% థియేటర్లు దిల్ రాజు తన ఆధీనంలో ఉంచుకోవడంతో.. మిగతా హీరోలకు పెద్దగా థియేటర్లు రావు. ఈ క్రమంలోనే సంక్రాంతి రేసులో వీరంతా తమ సినిమాలను తప్పించినట్లు కూడా టాక్ నడుస్తుంది.
అయితే బాలయ్య మాత్రం ముందుగా ఫిక్స్ అయిన విధంగానే సంక్రాంతిలో తన సినిమాను నిలపాలని సిద్ధమవుతున్నాడు. ఇక స్టార్ హీరోల సినిమాలన్నీ సైడ్ అవడంతో.. రంగంలోకి యంగ్ హీరోలు దిగుతున్నారట. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన మజాకా సంక్రాంతి బరిలో నిలవనుందుని టాక్. ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఇక సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయి.. కలెక్షన్ పరంగా లాభాలు వస్తాయి. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బడిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఈ సినిమాలు మాత్రమే ఉన్నా.. ఫ్యూచర్లో ఇంకెన్ని సినిమాలు రేస్ లో అడుగుపెడతాయో వేచి చూడాలి.