పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మొదట అక్టోబర్ 10న సినిమాను రిలీజ్ చేయాలని భావించినా.. కేవలం రజినీకాంత్ వెట్టయ్యాను సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశారు.
ఇక ఈ సినిమాల్లో హీరోయిన్గా దిశపటాన్ని నటించగా.. బాబీ డియల్, యోగి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు.. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించింది. ఇక ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మొదటి అక్టోబర్ 10న రిలీజ్ అనుకున్న.. సూర్య కేవలం రజనీకాంత్ పై ఉన్న గౌరవంతో వెట్టయన్ సినిమా కోసం తన సినిమా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూడా కంగువ సక్సెస్ కోసం తన వంతుగా సపోర్ట్ అందించేందుకు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయనున్నాడట. ఇకపోతే ఇదే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ప్రభాస్ కూడా రానున్నట్లు సమాచారం. దీనికి మెయిన్ రీజన్ యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ కలిసి కంగువాను ప్రొడ్యూస్ చేయడం.
యు వి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమాద ఇద్దరు ప్రభాస్ కు మొదటి నుంచి మంచి స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ను ఆహ్వానించారని.. దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. ఇక కంగువా సినిమా ఏకంగా 3500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ్తో పాటు.. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక దాదాపు రూ.1,000 కోట్ల టార్గెట్లో సినిమా తెరకెక్కనుంది. కాగా నిర్మాత ఈ సినిమాకు రెండువేల కోట్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే పార్ట్ 2 , పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని.. పార్ట్ వన్ సక్సెస్ తర్వాత మిగతా భాగాలు ప్లాన్ చేయనున్నట్లు మేకర్స్ వివరించారు.