టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. ప్రసతులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఫ్లాప్స్లో ఉన్న సమయంలో కూడా ఏ మాత్రం చెక్కుచెదరకుండా దూసుకుపోయిన మణిరత్నం.. మల్లి పోనియన్ సెల్వన్తో బౌన్స్ బ్యాక్ అయినా సంగతి తెలిసిందే. ఈ సీరిస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. కమల్ హాసన్తో థగ్ లైఫ్ సినిమాను రూపొందిస్తున్నాడు. దీంతోపాటు రజనీకాంత్తో మరో సినిమా కూడా ఫిక్స్ అయింది అన్న సంగతి తెలిసిందే.
ఇక గతంలో మణిరత్నం డైరెక్షన్లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి. వాటిలో యువ మూవీ ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని.. తమిళ్లో సూర్య, మాధవన్ కాంబినేషన్లో రూపొందించగా.. హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో తెరకెక్కించారు. అలాగే తెలుగులో సినిమాలు మొదట పవన్ , రవితేజతో తీయాలని భావించారట. కానీ.. చివరి నిమిషంలో అది వర్కౌట్ కాలేదు. తమిళ్లో సూర్య పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ తో.. మాధవన్ పోషించిన పాత్రను రవితేజ తో చేయించాలని మన రత్నం ప్లాన్ చేసుకున్నారట. ఇద్దరు హీరోలకు కథలు వినిపించడం.. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అయితే షూటింగ్ కి వెళ్లే ముందు టాలీవుడ్ స్టార్స్ తో ఈ సినిమా తీస్తే వర్క్ అవుట్ అవ్వదేమో.. అని పవన్ కళ్యాణ్ భావించాడట. దీంతో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందకపోతే ఈ కథను తీయొద్దు వేరే కథతో సినిమా తీద్దామని మనరత్నం చెప్పాడట.
అలా ఈ ప్రాజెక్టు సెట్ పైకి రాకముందే చెక్ పడిపోయింది. అయితే తమిళ్లో రిలీజ్ అయి పెద్ద సూపర్ హిట్ అవ్వగానే ఇదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాదు.. సినిమాలో సాంగ్స్ కు విపరీతమైన పాపులారిటీ దక్కింది. సూర్య తెలుగు ప్రేక్షకులను మొట్టమొదటిసారిగా ఈ సినిమాతోనే పలకరించారు. ఆల్ టైం క్లాసిక్ వాల్యూ ని సంపాదించుకున్న ఈ సినిమాల్లో.. పవన్ అన్నట్లుగానే ఆయన.. రవితేజ నటించినా కమర్షియల్ గా ఇంత సక్సెస్ వచ్చేది కాదని.. వీళ్ళిద్దరూ స్టార్ హీరోస్.. ఇక కథ చాలా స్లో పేస్ లో వెళుతుంది. ఇక పవన్, మణిరత్నం కాంబో మూవీ అంటే ఆడియన్స్ లో అంచనాలు తారస్థాయికి చేరుతాయి. అప్పుడు కచ్చితంగా మూవీ ఫ్లాప్ అయి ఉండేది. కనుక పవన్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసి మంచి పని చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా రూ.3 కోట్లు షేర్వసూళను దక్కించుకుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.30 కోట్ల కలెక్షన్లు సంపాదించి రికార్డు సృష్టించింది.