నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తాజా మూవీ దేవర.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్గా దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో మెప్పించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉందన్న అభిప్రాయాలు రివ్యూవర్స్ నుంచి అలాగే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వినిపించాయి.
అయినా ఎన్టీఆర్ఖు ఉన్న క్రేజ్ రీత్యా.. రివ్యూస్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. సినిమా చివర్లో డైరెక్టర్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేశారు. సస్పెన్స్ ఉంచారు. వాటికి సమాధానం సెకండ్ పార్ట్ లో చూడాలని కొరటాల వెల్లడించాడు. సినిమా మొదటివారం తోనే ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ వసుళను కల్లగొట్టడం విశేషం. దేవరకు ఈ రేంజ్లో సూపర్ సక్సెస్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర హిట్ పై మేకర్స్ కూడా చిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి.
అభిమానులు అలాగే సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడియోస్ అందరికి ధన్యవాదాలు చెప్పిన తారక్.. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఏదో వెలితీ ఈ సినిమా కోసం మేము పడ్డ కష్టం.. మీతో షేర్ చేసుకోవడానికి వేదిక దొరకలేదనిపించింది. అది ఒక్కటే కాస్త బాధగా ఉంది. దేవీ నవరాత్రులు కావడంతో పోలీసులు కూడా బహిరంగ సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. దీనికి అందరూ మమ్మల్ని క్షమించండి అంటూ ఎన్టీఆర్ అభిమానులను కోరుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో.. మీ కష్టం గురించి మీరు చెప్పకపోయినా.. మాకు తెలుసు అన్నయ్య.. మీ నటనతోనే దాని వెనుకున్న కష్టం మాకు అర్థమవుతుంది అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.