సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి.
ఇక నయనతార మొదట తన కెరీర్ తమిళ్ సినిమాతో మొదలుపెట్టి.. తర్వాత తెలుగు ఇండస్ట్రీలోను అవకాశాలను దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ.. దూసుకుపోయిన ఈ అమ్మడు కొలివుడ్, టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్ ఇండియా స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న నయన్.. ఇటీవల కాలంలో తెలుగు కంటే తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. ఇక కొంతకాలం క్రితం ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్లో.. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇక నయన్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. కాగా నయనతార ఎప్పటినుంచో టాటా స్కై కు బ్రాండ్ అంబాసిడర్ గా వివహరిస్తుంది. ఈ క్రమంలోని తాజాగా టాటా స్కై కోసం ఒక యాడ్ ను రూపొందించారట. ఇక ఈ యాడ్ కోసం దాదాపు రెండు రోజుల షూట్ జరిపారని.. కాగా యాడ్ అంతా కేవలం 50 సెకండ్లలో ప్రచారం చేయనున్నట్లు టాక్. ఇక ఈ ప్రకటనను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టెలికాస్ట్ చేస్తారట. కాగా ఈ 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ ఏకంగా రూ.5కోట్ల రమ్యునరేషన్ తీసుకున్నారంటూ వార్త నెటింట తెగ వైరల్గా మారుతుంది. ఇక ఇటీవల కాలంలో నయనతార ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ.. లేడీ ఓరియంటెడ్ మూవీ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.