‘ ఇంద్ర ‘ 175 డేస్ సెలబ్రేషన్స్‌లో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయా.. ఎన్టీఆర్ పై చిరు ముందే ప్రకాష్ రాజ్ సెటైర్లు..!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. ఎంతో మంది టాలీవుడ్ హీరోల అభిమానులు కూడా ఎంత ఇష్టంగా చూసిన సినిమా ఇంద్ర. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయంతో సునామీ సృష్టించింది. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి.. ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఇంద్ర.. కొన్ని ప్రాంతాల్లో అయితే కొత్త బెంచ్ మార్కులు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో చిరంజీవి లాంటి ఫ్యా క్షన్స్ సినిమాలకు అస్సలు సెట్ అవ్వడు. ఈయన సినీ కెరియర్‌లో ఇది పెద్ద ఫ్లాప్ గా నిలుస్తుంది అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎవరైతే అలా కామెంట్ చేశారో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత‌ వారితోనే స‌భాష్ అనిపించుకున్నారు మెగాస్టార్.

Indra's 175-Day Celebration Pic Goes Viral—Chandrababu, Chiru, Charan  Shine! | Indra's 175-Day Celebration Pic Goes Viral—Chandrababu, Chiru,  Charan Shine!

 

ఇండస్ట్రీలో తాను ఎలాంటి పాత్రనైనా నటించి సత్తా చాటగలన‌ని నిరూపించాడు. ఇక ఈ సినిమా అప్పట్లో కొన్ని కేంద్రాల్లో 122 రోజులు.. కొన్ని కేంద్రాల్లో 100 రోజులు.. నిరంతరాయంగా ఆడింది. అయితే ఏకంగా 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడ‌టం అంటే అది సాధారణ విషయం కాదు. అప్పట్లో ఈ సక్సెస్‌ను నిర్మాత అశ్వినీ ద‌త్త్‌ 175 ఈ వేడుకను వైభవంగా సెలబ్రేట్ చేశాడు. ఈ ఈవెంట్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉదయ్ కిరణ్, శ్రీకాంత్, రామ్ చరణ్ తదితరులు ఈవెంట్‌లో సందడి చేశారు. ఇక ఉదయ్ కిరణ్ ఆ ఈవెంట్ కు కొద్దిరోజుల ముందే ఆయ‌న పెద్ద కూతురు సుస్మితను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్లో ఉదయ్ కిరణ్ ఎమోషనల్ గా చిరంజీవిని పొగుడుతూ మాట్లాడిన మాటలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ ఈవెంట్‌లో ప్రకాష్ రాజ్ ప్రసంగం ఎంతో మంది ఆగ్రహానికి కారణమైంది. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కొంతమంది హీరోలు ఒకటి రెండు హిట్లు రాగానే అన్నయ్య తర్వాత మేమే అని చెప్పుకుంటూ తిరుగుతారు.

ఒక ట్యూబ్ లైట్ చుట్టూ పురుగులు తిరుగుతాయి.. అన్నయ్య చిరంజీవి ట్యూబ్ లైట్ అయితే ఆయన మీద కామెంట్ చేసే వారు పురుగులు లాంటివారు అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. ఇది కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అంటూ అప్పట్లో నందమూరి అభిమానులు ప్రకాష్ రాజు పై విరుచుకుపడ్డారు. ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బ‌స్టర్లతో మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని దూసుకుపోయాడు. ఈ క్రమంలో చిరంజీవికి కూడా కొంతకాలం గట్టి పోటీ ఇచ్చాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆయన ఇంతలా బ్యాడ్ కామెంట్స్ చేశాడంటూ ఈయనపై నందమూరి అభిమానులు మండిపడ్డారు. ఇక ఈ ఈవెంట్లో మరో హైలెట్ ఏంటంటే.. చిరంజీవి సినిమా సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ స్లోగన్ తో సభ ప్రాంగణం షేక్ అయిపోయింది. అభిమానులు అరవడంతో చిరంజీవి కూడా తన తమ్ముడికి అంత‌ ఆదరణ వచ్చినందుకు ఎంతగానో మురిసిపోయారు. ఈరోజు కళ్యాణ్ కూడా ఇక్కడ ఉండి ఉంటే ఎంతో బాగుండేది అంటూ ఆయన ఎమోషనల్ అయినా మాటలు.. అభిమానులను ఆకట్టుకున్నాయి.