టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా.. రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్.. టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల గురించి తెలియని వారు ఉండారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ళక్రితం మరణించిన సంగతి తెలిసిందే. ప్రభాస్కు పెదనాన్న అంటే ఎలాంటి అభిమానం.. ప్రేమ ఉందో ఎన్నో సందర్భాల్లో వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది.
ఇక కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలో అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇక కృష్ణంరాజు, చిరంజీవి ఇద్దరు మొగల్తూరుకు చెందిన వారే కావడం విశేషం. ఈ క్రమంలో ఓసారి కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం అపోలో హాస్పిటల్కి వెళ్ళగా వెంటనే ఉపాసన ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించిందని.. అంతేకాదు కృష్ణంరాజు గారిని బాగా చూసుకోవాలని సిబ్బందికి ఆర్డర్లు వేసిందంటూ చెప్పుకొచ్చింది. ఉపాసన పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసిన ముచ్చటగా అనిపించిందని.. ఆమె నా కూతురు లాంటిది అని కృష్ణంరాజు అన్నారని.. చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు నేను చాలా అదృష్టవంతులు.
అంత మంచి కొడుకు మంచి కోడలు ఉండడం అదృష్టమని అన్నానని.. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారంటూ చెప్పుకొచ్చాడు. ఇక చరణ్కు కూడా మేమంటే ఎంతో గౌరవమని.. ఎక్కడ కనిపించినా ఆంటీ అంటూ నన్ను కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తాడని శ్యామలా దేవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్యామలా దేవి ఉపాసనపై చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. అది మా ఉపాసన వదినమ్మ అంటే అంటూ.. మెగా కోడలు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ.. దట్ ఇజ్ ఉపాసన మేడం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.