టాలీవుడ్లో మెగా – అల్లు ఫ్యామిలి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఫ్యాన్స్ కోరగా చెప్పను బ్రదర్ అన్న కామెంట్ చేసినప్పటినుంచి ఈ వార్ మొదలైందని.. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వారు జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ కావాలనే తన భార్యతో కలిసి వెళ్లి మరీ వైసీపీకి సపోర్ట్ గా నిలిచాడు అంటూ మెగా అభిమానులు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తూ విమర్శించారు.
దీనికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు చేసే కామెంట్స్తో మెగా అల్లు కుటుంబాలకు మధ్యన గ్యాప్ను మరింతగా పెంచుతున్నాడు. ఇక తాజాగా డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన పవర్ స్టార్ కూడా ఓ సందర్భంలో సినిమాల గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా పై ఇన్ డైరెక్ట్గా పంచ్ వేశారు. గతంలో స్మగ్లర్ నుంచి అడవిని కాపాడే వ్యక్తిని హీరో అనే వాళ్ళని.. ఇప్పుడు అడవిలో స్మగ్లింగ్ చేసేవాడే హీరోగా సినిమాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ మధ్యలో పవర్ స్టార్, బన్నీ ఫ్యాన్స్ మధ్యన వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి అల్లు అర్జున్ తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని మాట్లాడుతూ మరోసారి రెచ్చగొట్టే విధంగా.. నాకు ఇష్టమైతే వస్తా.. ఏదైనా చేస్తా.. అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు.
అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్కు అల్లు అర్జున్ కామెంట్స్ మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ నుంచి సపరేట్ చేసి.. ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని చూడడమే ఇందుకు కారణమంటూ.. తమ లెగసి కారణంగానే మెగా ఫ్యామిలీ అంత పేరును సంపాదించుకున్నారంటూ.. బ్రమలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఎలాగైనా మెగా, అల్లు కుటుంబాలను వేరుగా అభిమానులు చూడాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న మొన్నటి వరకు కేవలం అల్లు అర్జున్ మాత్రమే చిరంజీవి కుటుంబాన్ని దూరం పెట్టినా.. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని సమాచారం.
నిన్న మొన్నటి వరకు చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడే ఉండే అల్లు అరవింద్.. ఇటీవల కాలంలో ఆయన వెనుక అసలు ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత సెలబ్రేషన్స్ లోనూ మెగా ఫ్యామిలీతో.. అల్లు ఫ్యామిలి ఎక్కడ కనిపించలేదు. ఇవన్నీ సంఘటనలు బట్టి ఈ ఇరుకుటుంబాల మధ్యన ఏ రేంజ్ లో వార్ జరుగుతుందో అర్థమవుతుంది. ఇక అల్లు, మెగా ఫ్యామిలీ వార్ని క్లియర్గా అర్థం చేసుకుంటే అస్థిరత్వ పోరాటమేనని తెలుస్తుందంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అల్లు ఇంటి అల్లుడైన తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందని అల్లు ఫ్యామిలి అభిప్రాయపడుతున్నారని.. కానీ మెగా ఫ్యామిలీ లెగసి మాటున అల్లు ఫ్యామిలీ బతకాల్సి వస్తుందని భావనతోనే.. తమ సొంత బ్రాండ్ నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ ఏదో గాలి వాటనా అలాంటి కామెంట్స్ చేయడం లేదని.. ప్లాన్ ప్రకారమే ఆయన ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ నుంచి వేరు చేయాలని ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఈ బ్రాండ్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో దీనికి చెక్ ఎలా పడుతుందో వేచి చూడాలి.