శ్యామల దేవి కామెంట్స్ తో ప్రభాస్, చరణ్ ఫ్యాన్స్ మధ్యన మినీ వార్.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం సాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల ప్రభాస్ ను ఓ పాత్రలో చూడాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుంద‌ని ఆమె కోరుకుంది. ఆ కోరికకు పునాది వేసింది భర్త కృష్ణంరాజేనా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 127 జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్యామలా దేవి మాట్లాడుతూ సీతారామరాజు బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Shyamala Devi : Prabhas marriage before Dussehra? But Who is the bride?

ఆమె మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు పాత్రను ప్రభాస్ చేస్తే ఆయనే మళ్లీ పుట్టినట్లు అనిపిస్తుందని.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రభాస్ ని చూడాలని ఉందంటూ అభిమానులు, ప్రేక్షకులు కూడా ఇదే కోరుకుంటున్నారు.. కొంతమంది అభిమానులు స్వయంగా నన్ను కూడా అడిగారు.. వారి కోరికను నేను ప్రభాస్‌కు తెలియజేస్తా.. ఆ పాత్ర చేసే విషయంలో ఎలాంటి అవకాశం ఉన్న నేను చేయమనే చెబుతా.. మన్యం వీరుడుగా నా బిడ్డను చూసుకోవాలని నాకు ఆశగా ఉంది అంటూ శ్యామలాదేవి కామెంట్ చేసింది. మన్యం వీరుడు పాత్రకు డార్లింగ్ ఎస్ చెబితే మాత్రం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.

Ram Charan | Facebook

అయితే శ్యామలాదేవి ప్రభాస్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడు.. అచ్చం అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లు ఉంటుంది అంటూ చేసిన కామెంట్స్ నెటిఇంట‌ హాట్ టాపిక్ గా మారాయి. దానికి కారణం రాంచ‌ర‌ణ్‌. గతంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాలో అల్లూరు సీతారామరాజు పాత్రలో చ‌ర‌ణ్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు చరణ్‌ తప్ప మరి ఎవరు అంతలా సెట్‌కారు అని మెగా ఫ్యాన్స్ చెప్తుంటే.. శ్యామలా దేవి రెబల్ స్టార్ మాత్రమే ఆ పాత్రలో సరిగా ఉంటారని మళ్ళీ అల్లూరి సీతారామరాజు పుట్టినట్లు ఉంటుందంటూ కామెంట్స్ చేయడంతో.. ఆమె చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో మెగా, రెబల్ అభిమానుల మధ్య మినీ వారి చోటుచేసుకుంది.