కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎంతోమంది అభిమానులను సంపాదించిన ధనుష్.. తాజాగా తన 50వ సినిమా రాయన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అందుకోలేక డీలా పడింది. ఇక సినిమాలో మ్యూజిక్ మరింత మైనస్ అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో రాయన్ రిజల్ట్తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాయన్ సినిమా రిసల్ట్కు మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడడానికి మధ్యన లింక్ ఏంటి అనుకుంటున్నారా..?
అసలు మ్యాటర్ ఏంటంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు చరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు.. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుందట. ఇక ప్రస్తుతం చరణ్ సినిమా పై ఫోకస్ పెట్టాడని.. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ను ఏరికోరి మరీ బుచ్చిబాబు సెలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం మెగా అభిమానుల్లో కలకలం రేపుతుందట. దానికి కారణం ధనుష్ హీరోగా నటించిన రాయన్ మూవీకి రహమాన్ మ్యూజిక్ అందించడమే అని తెలుస్తుంది. సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ రావడం.. సినిమాలో పాటలు అస్సలు బాగోలేదని.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చెత్తగా ఉందంటూ కామెంట్లు వినిపించాయి. దీని ఇంపాక్ట్ రాంచరణ్ హీరోగా నటించబోతున్న బుచ్చిబాబు సినిమా పై ఎక్కడ పడుతుందో అని టెన్షన్లో మెగా అభిమానులు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.