ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ మరి కొద్దిసేపట్లో వచ్చేస్తుందోచ్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 తరువాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న ప్రభాస్.. గతేడాది రిలీజ్ అయినా సలార్‌తో సక్సెస్ ట్రాక్‌ఎక్కాడు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898ఏడి తో రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి మరోసారి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో ది రాజా సబ్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన‌ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మరోసారి రాజాసాబ్ టీమ్ నుంచి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ రానుంది. రాజా సాబ్ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జూన్ 29(ఈ రోజు) సాయంత్రం ఐదు గంటలకు.. రాజాసాబ్ పాన్ ఇండియా గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Prabhas's and director Maruthi The Raja Saab special preview date announced  along with new poster - India Today

ఈ మూవీలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో.. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచే నెలకొంది. ఇప్పుడు ఓ స్పెషల్ వీడియోతో అభిమానులను అలరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఇక ఈ గ్లింప్స్‌ గురించి సమాచారం అందిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ మరింత కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ లుక్స్ స్టైలిష్ గా కనిపించడమే కాదు.. సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సలార్, కల్కి సినిమాల లాగానే డార్లింగ్ మరోసారి బ్లాక్ బ‌స్టర్ అందుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి.