చరణ్’ చిరుత ‘ బెనిఫిట్ షో టికెట్స్ దొరక్క.. పిఠాపురం వెళ్లి మరి సినిమా చూసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. చిరుత రిలీజ్ టైం లో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన సందడి నెలకొంది. చిరంజీవి కొడుకు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఎలా ఉంటాడో.. ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మెగా అభిమానులతో పాటు ఎంతో మంది జనం కూడా థియేటర్స్ వద్దకు పరుగులు తీశారు. చాలామంది చిరుత బెనిఫిట్ షో కోసం తెగ ఆరాటపడ్డారు.

Ram Charan - Pithapuram : 'చిరుత' సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. 'పిఠాపురం'  వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన హీరో.. | Hero ashwin babu interesting comments  on ram charan and pithapuram-10TV ...

ఇందులో సామాన్యులతో పాటు ఓ టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడట. అతను మరెవరో కాదు యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు. గ‌తేడాది హిడింబి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అశ్విన్.. ఇప్పుడు శివంభజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్న అశ్విన్.. చిరుత రిలీజ్ టైం లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అలాగే పిఠాపురం తో తనకున్న బాండింగ్ గురించి కూడా వివరించాడు. చరణ్‌ నటించిన చిరుత కు టికెట్స్ దొరకకపోతే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లి మరి 4:30కే బెనిఫిట్ షో పడిందని వివరించాడు.

Shivam Bhaje: Ashwin Babu shows his rage in first look - Telugu News -  IndiaGlitz.com

ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అనే వాళ్ళు.. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారని.. నేను ఆ ప్రాంతానికే చెందిన వ్యక్తిన‌ని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందంటూ వివరించాడు అశ్విన్ బాబు. దీనికి సంబంధించిన వీడియో నెటింట‌ తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన మెగా అభిమానులంతా అశ్విన్ బాబు చేసిన కామెంట్స్‌కు తెగ మురిసిపోతున్నారు. మెగా ఫ్యామిలీ క్రేజ్ అలాంటిది అంటూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.