నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల లిస్టులో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో nbk109 తర్వాత.. ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో బాలయ్య, దిల్ రాజు కాంబోలో మరో సినిమా సెట్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ట్రాక్ రికార్డ్ సృష్టించాడు.
అయితే సీనియర్ హీరోలైన చిరు, బాలయ్యతో మాత్రం ఆయన ఒక్క సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా పని చేయలేదు. ఈ క్రమంలో బాలయ్యతో భారీ సినిమాకు ప్రొడ్యూసర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలయ్య నటించే సినిమాలను తన చిన్న కూతురు తేజస్విని కూడా వింటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్రాజు నిర్మాణంలో చేయబోయే సినిమా డైరెక్టర్ను కూడా ఆమె సెలెక్ట్ చేయబోతుందట. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ప్రశాంత్ వర్మ లేదా హరిష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఇద్దరు బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ వీరిద్దరి సినిమాలు సెట్ప్ పైకి రాకపోతే బాలయ్య తన 111వ సినిమా అవకాశం కొరటాల శివకు ఇవ్వనున్నాడట. త్వరలోనే దేవర సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే.. కచ్చితంగా బాలయ్య.. కొరటాలకు అవకాశం ఇస్తాడని దేవర 2 కూడా పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో.. నిజంగానే బాలయ్య ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎవరితో చేసినా సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాలయ్య నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై అభిమానుల్లో అంతకంతకు ఆసక్తి పెరిగిపోతుంది.