సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట.
ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులందరూ వారి స్వగ్రామానికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన గ్రామంలో నిర్వహించాలని మహేష్ అనుకున్నట్టు ఆయన సన్నిహితుల నుంచి టాక్ వినిపిస్తుంది. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్బాబు దత్తత తీసుకుని మరీ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీని కన్నా ముందు ఈనెల 11 రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఆయన సంస్మరణ సభను ఆయన పుట్టి పెరిగిన స్వస్థలం మొగల్తూరులో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగాహాజరయ్యారు. వారందరికీ 50 రకాల వంటలతో రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని మహేష్ బాబు బుర్రిపాలెంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.