మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రాశి ఖన్నా.. తక్కువ సమయంలో ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోనూ స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రాశి.. మాలీవుడ్ లో సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తోంది.
ఆ మధ్య మోహన్ లాల్ నటించిన విలన్ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను పలకరించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో నటిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ హీరోలుగా నటిస్తుండగా.. రాశి, మమతామోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీలో హిట్ అయిన అంధాదున్ కు ఇది రీమేక్.
అక్టోబర్ 7న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అక్కడ భారీ అంచనాలు నెలకొనగా.. రాశి కూడా తన ఆశలన్నీ దానిపైనే పెట్టుకుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే.. రాశికి మలయాళంలో వరుస అఫర్లు వెల్లువెత్తుతాయి. మరి మాలీవుడ్లో రెండో సినిమా చేస్తున్న రాశిని అదృష్టం వరిస్తుందో..లేదో..చూడాలి.