అక్కినేని ఫ్యామిలీనే వెంటాడుతున్న బ్రేకప్ లు..అని అనగానే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చర్చించుకుంటున్నారు అనే విషయానికి వస్తే.. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వారి ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ లైఫ్ పార్టనర్ విషయంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం కూడా అదే కోవకు చెందినదే.
అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న వారిలో నాగార్జున, నాగచైతన్య,అఖిల్,సుమంత్ కుమార్,సుశాంత్, సుప్రియ మరియు అమల ఇలా వీరందరూ అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న సినీమాలలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. సినీ రంగంలో సక్సెస్ అయినప్పటికీ కూడా వైవాహిక జీవితాలకు సంబంధించి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
నాగార్జున మొదటి గా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి లక్ష్మి ని వివాహం చేసుకోగా.. ఆ తరువాత విడాకులు తీసుకొని అమలను వివాహం చేసుకున్నాడు.
హీరో సుమంత్ విషయానికి వస్తే.. హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకోగా ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయారు.
ఇక సుప్రియ మార్ల గడ్డ విషయానికొస్తే.. ఈమె నటిగా, నిర్మాతగా కొన్ని సినిమాలలో భావించినప్పటికీ.. ఇష్టం సినిమాతో హీరోగా మారిన చరణ్ రెడ్డి ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత చరణ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. కాని వీరిద్దరికీ ఇంతకుముందే మనస్పర్ధలు ఉన్నట్లు వినికిడి.
ఇక నాలుగు సంవత్సరాల క్రితం హీరో అఖిల్ కూడా శ్రేయ భూపాల్ తో నిశ్చితార్థం తర్వాత విడిపోయారు.
ఇక ఇప్పుడు సరిగ్గా 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని నాగ చైతన్య, సమంత విడిపోయారు.