టాలీవుడ్ క్యూట్ & స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. వాటిని నిన్న చైతు, సామ్లు నిజం చేస్తూ కుండ బద్దలు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు.
కానీ, నాలుగేళ్లు గడవకముందే వీరు విడాకులు తీసుకోవడాన్ని అటు అభిమానులతో పాటుగా ఇటు సినీ సెటబ్రెటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు చైతు-సామ్లపై ఆశ్చర్యపోతూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ అందరినీ షాక్ గురి చేస్తోంది.
`మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు తాను మొదటి సారిగా స్కూల్లో నేర్చుకున్న గుణపాఠం అదే…. మ మీరూ` అంటూ సామ్-చైతులు విడిపోబోతున్నామని ప్రకటించిన వెంటనే ట్వీట్ చేశారు సిద్ధార్థ్. దాంతో పలువురు నెటిజన్లు ఈ ట్వీట్ సామ్ గురించే అంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా, సామ్, సిద్దార్థ్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెళ్లి దాకా వెళ్లి విడిపోయారని, ఆ తర్వాతే చైతును వివాహం చేసుకుందని ఒకప్పుడు ఎన్నో కథనాలు వచ్చాయి.