`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ సమంత.. తన మొదటి హీరో నాగ చైతన్యనే 2017లో ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్న సమంత.. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకోబోతోంది.
అసలు విషయం ఏంటంటే..సమంత గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చైతు-సామ్ దంపతులు గోవాలో ఓ మంచి స్పాట్ను కనుగొన్నారట.
అంతేకాదు, ఆ స్పాట్ను తర్వలోనే కొనుగోలు చేసి.. అక్కడ తమ టేస్ట్కు తగ్గట్టుగా ఓ మంచి ఫామ్హౌస్ను నిర్మించుకోబోతున్నారట. కాగా, సమంతకు గోవా అంటే చాలా ఇష్టం. ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో గోవాలో నివసించడం అంటే ఇష్టమని చెప్పింది. పైగా సమంత, చైతూల వివాహం జరిగింది కూడా గోవాలోనే.