`లైగ‌ర్‌`కు రూ. 200 కోట్ల ఆఫ‌ర్‌..విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ రిప్లై!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం లైగ‌ర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. లైగ‌ర్‌ను అన్ని భాషల్లోను నేరుగా డిజిట‌ల్ రిలీజ్ కి ఇవ్వమంటూ ఓ పాపుల‌ర్ ఓటీటీ సంస్థ 200 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిన‌ట్టు ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ విష‌యంపై విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. లైగర్ ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్‌ను కోట్ చేస్తూ.. ఇది చాలా తక్కువ. నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి చూపిస్తా అంటూ రౌడీ ట్వీట్ చేశాడు. దాంతో లైగ‌ర్ పై మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి.