కియారా రెమ్యునరేషన్ ఏంటంటే..?

kiyara advani

భారత్ నేను అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. వినయ విధేయ రామ సినిమాలలో రామ్ చరణ్ సరసన నటించి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కియారా అద్వానీ అడిగిన ఆమెను రెమ్యునరేషన్ చెల్లించలేక కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేష న్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. కరోనా వల్ల నిర్మాతలకు సినిమా నిర్మాణం భారంగా మారింది. శంకర్ చరణ్ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు కియారాను తీసుకోవాలని భావిస్తుండగా ఆమెనే ఎంపిక చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు సినిమాసినిమాకు కియారా అద్వానీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. బాలీవుడ్ లో కియారా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ అవుతున్నాయి. కియారా అద్వానీ పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో ఆమెను తీసుకుంటే సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.