ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీయఫ్’ సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’. ఈ సినిమా జులై 16న తెరపైకి రావాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో థియేటర్ల మూతపడాయి.
అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నద్ధమైందని సమాచారం. ఇప్పటికే సినిమా కన్నడ వెర్షన్ డబ్బింగ్ పూర్తయింది. ఆ మధ్య దర్శకుడు ప్రశాంత్నీల్ డబ్బింగ్ స్టూడియోలో హీరో యశ్తో కలిసి దిగిన ఫొటోను తన ట్విటర్లో షేర్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బ్రసూర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. సంజయ్దత్ అధీరా పాత్రలో నటిస్తుండగా రవీనా టాండన్ ప్రధాని రమికా సేన్ పాత్రలో కనిపించనుంది. ప్రకాశ్రాజ్, అనంత్ నాగ్, రావు రమేశ్, ఈశ్వరీరావు, టీఎస్ నాగాభరణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
#KGFChapter2 Worldwide Theatrical Release On July 16th, 2021.#KGFChapter2onJuly16@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/ch1yq07TdA
— Hombale Films (@hombalefilms) January 29, 2021