రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని నిలువరించే క్రమంలో డైవ్ చేసిన శ్రేయాస్.. తన శరీర బరువు మొత్తాన్ని ఎడమ భుజంపై మోపేయంతో..ఎముక పక్కకు జరిగింది. దీంతో అతడి భుజానికి వైద్యులు సర్జరీ చేయబోతున్నారు.
ఇప్పటికే వన్డేకు దూరమైన శ్రేయాస్.. సర్జరీ కారణంగా ఐపీఎల్ టోర్నీ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే శ్రేయాస్ తప్పుకోవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎవరు కెప్టెన్ గా వహిస్తారన్న చర్చ అందరిలోనూ మొదలైంది. తాజాగా ఈ విషయంపై ల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ క్లారిటీ ఇచ్చేసింది.
డాషింగ్ యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా నియమించినట్టు తాజాగా యాజమాన్యం ప్రకటించింది. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ పంత్ సామర్ధవంతంగా జట్టును ముందుకు నడిపించగలడని టీమ్ మెనేజ్మెంట్ విశ్వాసం వ్యక్తం చేసింది.