ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
Tag: Latest news
`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్బాబు. నివేదా థామస్, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు […]
ఏపీ ప్రజలను అలర్ట్.. రేపటి నుంచే కర్ఫ్యూ అమలు!
తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం […]
టాలీవుడ్లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక విషాదాన్ని జీర్ణించుకోకముందే.. మరో విషాదం జరిగిపోతుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా అనిత మృతి చెందారు. అనిత అకాల మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!
ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప`రాజ్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్పరాజ్ను పరిచయం చేస్తూ బన్నీ బర్త్డే నాడు పుష్ప టీజర్ను విడుదల చేసింది చిత్రం యూనిట్. అయితే తాజాగా ఈ టీజర్ ఫస్ట్ అండ్ […]
`అఖండ` ఫస్ట్ సింగిల్కు రంగం సిద్ధం..?!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్కు రంగం సిద్ధం చేస్తున్నారని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ […]
ఆ హిట్ డైరెక్టర్కు ఓకే చెప్పిన మెగా మేనల్లుడు?!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇటీవలె ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణవ్.. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మరో డైరెక్టర్కు కూడా వైష్ణవ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఛలో, భీష్మ […]
భారత్లో 2 కోట్లు దాటిన కరోనా కేసులు..3,449 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 3,57,229 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833 కు చేరుకుంది. అలాగే నిన్న 3,449 మంది […]