కడియం శ్రీహరికి చెక్‌ పెడ్తారా?

తెలంగాణలో ఎంసెట్‌ వివాదాస్పదమయ్యింది. నీట్‌ పరీక్ష కారణంగా ఎంసెట్‌-1, ఎంసెట్‌-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్‌ అభ్యర్థులు. అయితే ఎంసెట్‌-2 లీక్‌ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్‌-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్‌-2లో ర్యాంకులు పొందారు. పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]

కెసియార్‌ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్‌ 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్‌ సహా టిఆర్‌ఎస్‌ నాయకులు నినదించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు […]

ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క

రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే […]

ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]

కార్నర్‌ అయ్యింది హరీష్‌రావే

మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్‌ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్‌ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ […]

మోడీ చెయ్యిదాటిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం నరేంద్రమోడీ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది. రాజ్యసభలో తమ సభ్యుడి ద్వారా ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టించిన కాంగ్రెసు పార్టీ, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలనే కసితో ఉంది. కాంగ్రెసు వ్యూహాల్ని పసిగట్టడంలో బిజెపి విఫలమయ్యిందని నరేంద్రమోడీ, పార్టీ వేదికపై ముఖ్య నేతలకు క్లాస్‌ తీసుకున్నారట. రైల్వే జోన్‌ అంశంపై స్పష్టతను ఇవ్వడం, ప్రత్యేక ప్యాకేజీపై కొంతమేర ప్రకటన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని నరేంద్రమోడీ భావిస్తున్నారని […]

చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్

ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]

కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు

మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]

చంద్రబాబు ఈసారి రిస్క్‌ చేయదలచుకోలేదు

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్‌ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా […]