టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్లోను మంచి ఆసక్తి నెలకొంది. కాగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో ప్రారంభమైన ఈ సినిమా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ ప్రారంభించిన టీం.. ఇప్పటికే మూడు సాంగ్స్ను, టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన క్రిష్.. పవన్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ తో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నడంటూ టాక్ వైరల్ గా మారింది. కాగా.. ఈనెల 8న హరిహర వీరమల్లు ట్రైలర్ గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు టీం. ఈ విషయాన్ని టీం అఫీషియల్గా ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఎం.ఎం. రత్నం మాట్లాడుతూ.. సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. ఇప్పటివరకు క్రియేటివ్ డిఫరెన్స్ అనే వార్తలు రావడం దానికి తగ్గట్టు.. క్రిష్ వెంటనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. నిర్మాత ఎం.ఎం. రత్నం కొడుకు.. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించడంతో.. ఈ వార్తలు నిజమేనన్న వాదన కూడా వైరల్గా మారుతుంది. అయితే.. దీనిపై నిర్మాత ఎం.ఎం. రత్నం మాట్లాడుతూ అసలు కారణం ప్రాజెక్ట్ ప్రారంభించి ఐదేళ్లకు పైగా అవుతుండడం.. కరోనాతో పాటు.. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డేట్స్ పెద్ద సమస్యగా మారాయి. దీంతో.. క్రిష్కు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. అప్పటికే వీరమల్లు ప్రాజెక్ట్ కోసం.. చాలా రోజుల తన సమయాన్ని కేటాయించారు. అయితే.. అప్పట్లో పవన్ డేట్ సమస్య ఏర్పడింది. పాలిటిక్స్లో బిజీగా ఉండడంతో ఆయన సమయాన్ని ఇవ్వలేకపోయాడు. దీంతో.. క్రిష్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ వివరించాడు.
అయితే.. డైరెక్టర్ క్రిష్ తప్పుకుంటే నేనే జ్యోతి కృష్ణని దర్శకుడుగా సజెస్ట్ చేశానని.. అందుకే జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడంటూ పేర్కొన్నాడు. ఇక తన కొడుకుకు కాలేజ్ టైం నుంచి కదలంటే చాలా ఇష్టం అని.. స్నేహం కోసం కథను తానే రాసాడని వివరించాడు. అప్పుడే తన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవని.. ఇప్పుడు హరిహర వీరమల్లు ఆయనకు బాగా సెట్ అయిందంటూ వివరించాడు. సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు రత్నం. ఇక సినిమా రెండు పార్ట్లుగా రానుంది. మొదటి భాగం ఎండింగ్.. బాహుబలిలో కట్టప్ప ఎపిసోడ్ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందని పేర్కొన్నాడు. ఇక మూవీ టైటిల్ గురించి మాట్లాడుతూ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అని జ్యోతి క్రిష్ణనే పెట్టారని.. జ్యోతి కృష్ణ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. దాని ట్రీట్మెంట్ మారిందని.. సినిమా కంప్లీట్ అయ్యాక క్రిష్ గారికి కూడా చూపించనున్నాం అంటూ వెల్లడించాడు. పవన్ వీరమల్లుగా నటిస్తున్న ఈ సినిమాకి.. బాబి డియోల్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలో మెరమన్నారు. జూన్ 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.