గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్రాజు వ్యవహరించారు. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ హాజరై సందడి చేశారు. ఇక డైరెక్టర్ శంకర్ అనగానే టక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక్కడు మూవీ. ఒక్కరోజు సీఎం అంటూ స్పెషల్ కాన్సెప్ట్తో అందర్నీ ఆలోచింపచేసాడు. తన కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు.. సౌత్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక శంకర్ సినిమాలు తెలుగులో డబ్బై కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఒకప్పుడు తిరుగులేని స్టార్ డైరెక్టర్గా వరుస బ్లాక్ బాస్టర్లతో ఇండస్ట్రీ హీట్లతో దూసుకుపోయిన శంకర్.. గత కొద్ది ఏళ్ళుగా సక్సెస్ రేసులో వెనుకబడ్డినా ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. అలాంటి శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఎవరితో ఉంటుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం శంకర్ తన నెక్స్ట్ మూవీ వేల్పరి సినిమాలు తెరకెక్కించనున్నాడట.
అది ఆయన డ్రీం ప్రాజెక్టని ఎప్పటి నుంచో చెబుతున్నారు. లాక్ డౌన్ లోనే సినిమాకు స్క్రిప్ట్ పూర్తి చేసుకున్న శంకర్.. త్వరలో సినిమాకు పూజా కార్యక్రమాలు ప్రారంభించి షూట్ ను ప్రారంభించనున్నాడట. అయితే మొదట ఈ సినిమాకు సూర్యని హీరోగా అనుకున్న.. సూర్య దానికి ఆసక్తి చేపలేదని.. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఆ ప్లేస్ లో రీప్లేస్ చేయాలంటూ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే శంకర్ ఎప్పటినుంచో చిరుతో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనుకున్నట్లు అన్నీ కుదిరితే చీరు కూడా ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నాడట. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా.. చిరు ఒ ప్పుకుంటాడా నో చెప్తాడా వేచి చూడాలి. ఒకవేళ వీళ్ళ ముగ్గురి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు.