2024 టాలీవుడ్ ప్రయాణం మంచి సక్సస్లతో మొదలై..భారీ హిట్లతో పాటు.. ఎన్నో వివాదాలతో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బచ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధమైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమాల ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త ఎక్కువ అయ్యాయి.
ఇక తాజా పరిణామా క్రమంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో మాత్రం అలాంటి సమస్య లేదు. దీంతో ఏపీ గవర్నమెంట్ సంక్రాంతి సినిమాలకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనుంది. భారీ టికెట్ ధరలకు వీలు కల్పించనుంది. తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలకు ఇపపటికే పెంచిన టికెట్ రేట్లు ఫిక్స్ అయ్యాయట. ఇక ఏ మూవీకి ఎంత వరకు ఏపి టికెట్ రెట్లు పెరిగాయో ఇప్పుడు చూద్దాం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా మూవీ కనుక.. అందుకు తగ్గట్లుగానే టికెట్ రేట్లు పెంపు గేమ్ ఛేంజర్ జరిగింది. ఈ మూవీకి సింగిల్ స్క్రీన్స్ లో రూ.135, మల్టిఫ్లెక్స్ లలో రూ.175 అదనంగా పెంచుకునే పర్మిషన్స్ ఇచ్చిందట.
అలాగే 1 గంట బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చి.. బెనిఫిట్ షోలకు 600 అదనంగా టికెట్ ధరలు పెంచుకునేలా గ్రీన్సిగ్నల్ ఇచ్చిందట. డాకు మహారాజ్ మూవీకి.. రూ.110 సింగిల్ స్క్రీన్ కు, రూ.135 మల్టిఫ్లెక్స్లకు పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోకు రూ.500 వరకు పెంచవచ్చు. సంక్రాంతికి వస్తున్నాంకు రూ.75 సింగిల్ స్క్రీన్, రూ.100 మల్టీప్లక్స్కు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. ఈ మూవీ బెనిఫిట్ షోల అవసరం లేదు. ఇలా మొత్తంగా ఏపీ గవర్నమెంట్ ఈ 3 సినిమాలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడం జరగదు కాబట్టి.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.