టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ లేదు డైరెక్టర్ సరిగా చేయకపోతే హీరో జోక్యం చేసుకోరా అంటూ చిరంజీవి అభిమానులపై ఫైర్ అయ్యారు.
ఇక ఇటీవల మెగాస్టార్ విశ్వంభర సినిమా టీజర్ రిలీజ్ కాగా విఎఫ్ఎక్స నాణ్యత పై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. గ్రాఫిక్స్ సరిగా ఉందా.. లేదా.. అనేది చిన్నపిల్లలయినా చెప్పేసే విధంగా ఉంది. విశ్వంభర విఎఫ్ఎక్స్ కూడా ఆదిపురుష్ తరహాలో ఉందంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందా అని చర్చ మొదలైంది. కాగా ప్రస్తుతం చిరంజీవి స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారట. తనతో ఎంతో సన్నిహితంగా ఉండే ఇద్దరు డైరెక్టర్స్, కెమెరామెన్ చోటా కె నాయుడుతో కలిసి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ సినిమాకు ఓకే చెప్పి మరి.. దాన్ని వాయిదా వేసి చిరు వశిష్ట సినిమాలో నటించాడు.
దీంతో రాజీ పడకుండా సినిమా రావాలని ఉద్దేశంతో ఉన్నాడట. ఇంతకుముందు వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్తో డైరెక్టర్ వశిష్టకు ఇబ్బంది లేకుండా.. ఏం చేయాలని చిరంజీవి వాళ్ళతో చర్చలు జరిపాడని టాక్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువ టైం ఉండడంతో నాణ్యత ఎక్కడ దెబ్బ తింటుందో చూసుకొని వాటిని సరిచేసుకునే ప్లాన్లో చిరు ఉన్నాడట. అయితే టీజర్ లో చూపించిన సీన్స్ అన్ని సినిమాలో ఉండవని.. ఏఐ ద్వారా వాటిని టీజర్ లో వాడితే అవే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. నెటిజన్ల ద్వారా వచ్చిన విమర్శలు ట్రైలర్ కు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారట. అందుకే విఎఫ్ఎక్స్ పై మూవీ యూనిట్ చర్చలు జరుగుతుందని సమాచారం.