2025 సంక్రాంతి బరిలో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి పెద్ద పెద్ద సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్, చిరు, బన్నీ, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది హీరోలు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నా సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలపై అంచనాలు తగ్గడమే కాదు.. కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలు అసలు వర్కౌట్ అవుతాయా.. లేదా.. అని ఆందోళన అభిమానులు మొదలైంది.
అసలు ఈ హీరోలు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది సందేహంగా మారింది. మ్యాటర్ ఏంటంటే.. డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలతో పుష్ప 2పై ప్రభావం పడుతుందని.. సినిమా వర్కౌట్ అవ్వడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చరణ్ గత కొన్ని సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్ సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో సినిమాపై మంచి అంచనాలు ఉన్నా.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కావడం.. శంకర్ నుంచి గతంలో వచ్చిన ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి.
అంతేకాదు ఇటీవల సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందో.. లేదో.. అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హరహరమల్లు 2019లో మొదలుపెట్టిన ఇప్పటివరకు షూటింగ్లో పూర్తి చేయలేదు. మొదట్లో కృష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సమయం గడుస్తున్న షూట్ పూర్తి కాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు కృష్. దీంతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఇక సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ ప్రాజెక్టుకు ఎం.రత్నం కొడుకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. పక్క కమర్షియల్ హీట్లతో పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్.. ఇలాంటి క్రమంలో మారుతి లాంటి దర్శకుడికి ఎలా అవకాశం ఇచ్చారు.. అసలు ఎందుకు అంగీకరించారు అంటూ పలువురు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 10 సినిమా రిలీజ్ కానుంది.
మెగాస్టార్ అంజి లాంటి సోషియ ఫాంటసీ డ్రామా అంజీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కాలానికి విశ్వంభరతో మరో సోషియా ఫాంటసీ డ్రామాను ఆడియన్స్ ముందుకు తీసుకురన్నారు. ఆధ్యాత్మిక శైలిలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లా సందేహాలు మొదలయ్యాయి. ఇక మొదట్లో సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం దీనిని సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఏది ఏమైనా విశ్వంభర సినిమా కూడా రిస్క్ లో ఉందనే అనిపిస్తుంది. ఇక ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కు సిద్ధమైన ఈ పెద్ద సినిమాలు ఫ్యూచర్లో ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటాయా.. ఆడియన్స్ను నిరాశ పరుస్తాయా వేచి చూడాలి.