టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్తో సంబంధం లేకుండా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పాన్ ఇండియా లెవెల్లో సెన్సెషనల్గా సత్తా చాటనుందని తమ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే భారీ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందట. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని మించిపోయి బిజినెస్ జరుపుకుంటుందని టాక్. నైజాంలో ఏకంగా రూ.80 కోట్లు, ఆంధ్రాలో రూ.85 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్. అలా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.195 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇది ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ కావడం విశేషం.
ఈ బిజినెస్ లెక్కల ప్రకారం తెలుగులో పుష్ప-2 బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.200 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్, బాహుబలి2 రూ.200 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ఇక కల్కి రూ.180 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో పుష్ప 2 సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతుందో లేదో తెలుసుకోవాలనే ఆశక్తి ప్రేక్షకులో మొదలైంది. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని సెన్సేషన్స్ సీష్టిస్తుందో చూడాలి.