ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరికి ముందు తెలియదు. సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే దానిపై దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెద్దగా కంటెంట్ లేకపోయినా.. సినిమాలకు కూడా ఆడియన్స్ విపరీతంగా క్యూ కడతారు. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకైనా.. నెగటివ్ టాక్ తో సినిమా ఫ్లాప్ గా నిలుస్తుంది. అంతేకాదు సినిమా రిజల్ట్పై రిలీజ్కి ముందు దర్శక, నిర్మాతల, హీరోల స్టేట్మెంట్లు చేసిన తప్పులు కూడా కారణాలుగా నిలిచిన సందర్భాలు ఉంటాయి. అలా 2002లో రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డి సినిమాకు మొదట మిక్సడ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్కు ముందే బాలయ్య మాట్లాడుతూ జయపజయాలు దేవుడు చేతిలో ఉంటాయి.. మనం సినిమా కోసం కష్టపడ్డాం.
బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ వివి వినాయక్తో చెప్పారట. విడుదలైన తర్వాత కొత్తగా ఓ పాటను కూడా యాడ్ చేశారట. అయితే ఆ పాట జోడించిన తర్వాత సినిమాలో కాస్త పికప్మెంట్ కనిపించిందట. సినిమా 60 నుంచి 65 శాతం రెవెన్యూ రాబట్టింది. అలాంటి సమయంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన సంచలన కామెంట్స్ కారణంగా ఒక్కసారిగా ఊపందుకున్న వసూళ్లు పడిపోయాయట. అలా చెన్నకేశవరెడ్డి ఫ్లాప్ కు బెల్లంకొండ సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఓ కారణమైంది అంటూ వినాయక్ చెప్పుకొచ్చాడు. బెల్లంకొండ సురేష్ తో ఆ స్టేట్మెంట్ వేరొకరు ఇప్పించారని. కేవలం ఆయన కారణంగానే సూపర్ హిట్ కావాల్సిన చెన్నకేశవరెడ్డి ఆవరేజ్ టాక్ తో నిలిచిందని చెప్పుకొచ్చారు.
తెలుపు తెలుపు తెలుపు.. అనే మా సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత యాడ్ చేశారు. ఇక సినిమాలో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ కూడా ట్రోల్స్కు గురయ్యాయి.. ఎయిర్ పిల్లోస్ కట్టుకొని బాలకృష్ణ బిల్డింగ్ పై నుంచి దూకడాన్ని యాంటి ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. కానీ చెన్నకేశవరెడ్డి మూవీలో కొన్ని సన్నివేశాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటూ వినాయక్ వివరించాడు. ఇక మొదట ఆది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై బ్లాక్ బస్టర్ కొట్టిన వి.వి. వినాయక్.. ఆ సినిమా తర్వాత వెంటనే బాలయ్యతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. అప్పటికే ఫ్యాక్షన్ కథలతో ఇండస్ట్రీ హీట్లు కొట్టిన బాలయ్యతో సినిమా అనడంతో ఆడియన్స్ లో అంచనాలు పిక్స్ లెవెల్ కి వెళ్ళాయి. ఈ క్రమంలో చెన్నకేశవరెడ్డి సినిమా చూసిన ఆడియన్స్ను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.