మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలు తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామ దేవర పార్ట్1 తాజాగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన దేవర.. బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించింది.
మొదటి రోజు ఏకంగా రూ.173 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన దేవర.. ఆరవ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి మరోసారి సత్తా చాటింది. ఈ విషయాన్ని దేవర టీం ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా వసూళ పరంగా దేవర దూసుకుపోయింది. కేవలం ఆరు రోజుల్లోనే పాన్ ఇండియా లెవెల్ లో రూ.207. 45 కోట్ల నెట్ వసూలు రాబట్టిన దేవర.. కేవలం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.45.87 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది.
మొదటి వారంలోని రూ.300 కోట్ల మార్క్ దాటేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్టడీ కలెక్షన్స్ తో రోజు కొనసాగితే.. త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్ లో దేవర చేరడం ఖాయం అంటూ వెల్లడిస్తున్నారు. కాగా ఈ సినిమా బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర కనిపించారు. జాన్వీ కపూర్కు తెలుగులో ఇది మొదటి సినిమా కావడం విశేషం.