హేమా కమిటీ ఎఫెక్ట్.. పరారీల్లో ఆ సీనియర్ స్టార్ యాక్టర్..!

మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక గత కొద్ది రోజులుగా ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. మ‌ళ‌యాళ‌ ఇండస్ట్రీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల సమస్యలపై హేమా కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఎంతో మంది డైరెక్టర్లు, నటులు హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలా మలయాళ నటుల‌లో ఒకరైన సిద్ధికి పైన కూడా కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. కాగా ఈ సీనియ‌ర్‌ నటుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.

ఈ విషయంపై పోలీసులు కూడా నటుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. హేమ కమిటీతో పాటు మీటూ ఉద్యమం కూడా చాలామంది నటీనటులు, హీరోలు, డైరెక్టర్లను వివాదాల్లో చిక్కుకునేలా చేసింది. అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేస్తూ.. తనకు అవకాశాలు ఇవ్వాలంటే కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడని.. తన డిమాండ్లను ఒప్పుకోమంటూ సిద్ధికి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ నటి 2016లో ఫిర్యాదుల పేర్కొంది. అయితే ఆ సమయంలో సిద్ధికి ఈ వార్త‌ల‌ను ఖండించాడు. ఇక 2019లో సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపించిన సిద్ధికి.. వెంట‌న్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేసుకున్నారట‌.

అయితే ఈ విషయాన్ని కేరళ హైకోర్టు కొట్టి వేసిందని టాక్‌. ఈ విషయంపై ఆరోపణలు చేసినటువంటి నటి కూడా మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు ఆనందాన్ని కల్పించిందంటూ చెప్పుకొచ్చింది. ఇక రాబోయే విచారణ కోసం నేను ఎదురు చూస్తున్నానని.. కానీ సిట్ విచారణ పైన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ దర్యాప్తును రహస్యంగా చేస్తే బాగుంటుంది అంటూ.. మీడియా వల్ల‌ లీక్ అయితే ఇది నిందితులకు కూడా చాలా హెల్ప్ అవుతుందంటూ నటి వెల్లడించింది. ఈ క్ర‌మంలో తాజాగా సిద్దికి ప‌రారీలో ఉన్నాడ‌ట‌.