ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగతి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే బాగుంటుందని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు.
అయితే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ తో నటించి చాలా పెద్ద తప్పు చేశానంటూ బాధపడిందట. బన్నీ సినిమా కారణంగా ఎన్నొ ఇబ్బందులు పడిందట.. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆమె టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మనుయ్యేల్. నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలా గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించిన అనూ.. బన్నీ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో సినిమా ఆక్టర్ ప్లాప్ అవ్వడానికి కారణం అను ఇమ్మనుయ్యేల్ అంటూ.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఆమెను విపరీతంగా తిట్టిపోశారట. ఆమెను ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారట. దీంతో అను ఇమాన్యుల్ చాలా ఇబ్బంది పడిందని.. మానసికంగా ఎంతో బాధపడిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలు నటించకుండా ఉండి ఉంటే బాగుండేది.. ఈ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశానంటూ.. సన్నిహితులతో కూడా చెప్పుకొచ్చిందట. అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అను ఇమ్మనుయ్యేల్ టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో కొలువుడ్ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.