టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్.. ఫిమేల్ లీడ్గా కనిపించనుంది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా ప్రారంబమయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో నాని అండ్ టీం పాల్గొని సందడి చేశారు. ఇక తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత డివీవీ దానయ్యకు.. నాచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ ప్రశ్నను స్పందించాడు. ప్రస్తుతం నాని అడిగిన ఆ ప్రశ్న టాక్ఆఫ్దిటౌన్ గా నిలిచింది.
డివీవీ దానయ్యను.. నాని మాట్లాడుతూ.. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ అప్డేట్ ఎప్పుడు అంటూ ప్రశ్నించాడు. దీనిపై డీవీవీ దానయ్య రియాక్ట్ అవుతూ.. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని.. ఓజీ చివరి దశ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్తో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఎంతోమందిలో మెదులుతున్న ఈ ప్రశ్నలు.. నాని ఆఫ్లైన్లో ప్రొడ్యూసర్ని అడగగా.. ఈ ప్రశ్నకు స్టేజ్ పై స్పందిస్తూ.. ఫ్యాన్స్లో ఉన్న డౌట్లకు చెక్ పెట్టాడు దానయ్య.
ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇతర భాషల్లో సూర్య సాటర్డే.. టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ కం డైరెక్టర్.. ఎస్.జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన స్టిల్స్ నెటింట వైరల్ గా మారడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.