పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కితో భారీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ఆరు సినిమాల బిజీ లైనప్తో దూసుకుపోతున్న ప్రభాస్.. హీరోగా ఎన్నొ భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాడు. వాటిలో ఆది పురుష్ కూడా ఒకటి. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫ్యాన్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దీంతో ఈ సినిమా డైరెక్టర్పై ఎన్నో విమర్శలు ట్రోల్ జరిగాయి.
చాలామంది ఈ మూవీలో చూపించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేయడమే కాదు.. ప్రభాస్, కృతి సనన్పై కూడా ఎన్నో ట్రోల్స్ ను చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. ఆదిపురుష్ గురించి రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అయిందని చాలా బాధపడ్డాను అంటూ వివరించింది. కానీ ఆ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డామని చెబుతూ బోరున ఏడ్చేసింది. ఆది పురుష్ మూవీ తర్వాత తనకు లాభం కంటే ఎక్కువగా నష్టమే జరిగిందని.. ఆదిపురుష్ సినిమా ఏ మతం వారిని అవమానించాలని ఉద్దేశంతో తెరకెక్కలేదని.. కానీ ప్రజలు అలా అనుకోవడంతో ఎన్నో వివాదాలు తలెత్తాయని వివరించింది.
అసలు ఆదిపురుష్ సినిమాలో చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అన్నట్లుగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. ప్రభాస్తో కలిసి నటించి తప్పు చేశానని అర్థం వచ్చేలా తను కామెంట్లు చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. మరికొందరు మాత్రం దీని గురించి ఇప్పుడు బాధపడిన లాభం లేదు కదా కృతి. ఇంకా నీకు మంచి అవకాశాలు వస్తాయి అంటూ.. ఆమెకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కృతి చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్గా మారాయి.